Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

ప్రాచీన కళలను అందరూ ప్రోత్సహించాలి.. డిఇఓ మీనాక్షి దేవి

విశాలాంధ్ర ధర్మవరం:: మన భారతీయ ప్రాచీన కళలను అందరూ ప్రోత్సహించినప్పుడే మంచి గుర్తింపు సమాజంలో లభిస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారిని మీనాక్షి దేవి, అనంతపురం లలిత కళాపరిషత్ చైర్మన్ పద్మజ, ఆంధ్రప్రదేశ్ సకల కళావృత్తి సంఘం అధ్యక్షులు ఆనంద్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో శ్రీ లలిత నాట్య కళానికేతన్, వేసవి నాట్య శిక్షణ శిబిరం ముగింపు సంబరాలకు వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం శ్రీ లలిత నాట్య కళానికేతన్ గురువు బాబు బాలాజీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో వేసవి నాట్య శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, శిక్షణ తరగతులు ముగిసిన తర్వాత ప్రదర్శన కార్యక్రమం ఆనవాయితీగా వస్తున్నదని తెలిపారు. ఈ వేసవి నాట్య శిక్షణ శిబిరంలో 45 రోజులు పాటు 60 మంది విద్యార్థులకు కూచిపూడి, భరతనాట్యం, జానపద గేయాలను నేర్పించడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే తాను వివిధ రాష్ట్రాలకు, వివిధ జిల్లాలకు మా కళానికేతన్యొక్క ప్రదర్శనలతో పాటు వివిధ అవార్డులు పొందడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ బాబు బాలాజీ వారి శిష్య బృందం యొక్క ప్రదర్శన కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శన ఇవ్వడం మాకెంతో సంతోషాన్ని ఇవ్వడం జరిగిందని, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువుతోపాటు ఇటువంటి కళలను నేర్పించుట ఎంతో అవసరమని తెలిపారు. మన సాంప్రదాయమైన ఇటువంటి వాటిని ప్రతి చోటా నిర్వహించినప్పుడే మనకు ఉన్నతమైన స్థానం లభిస్తుందని, ఇప్పటికే ప్రపంచ స్థాయిలో మన భారతీయ కళలు ఎంతగానో గుర్తించబడ్డాయని తెలిపారు. దేశ,విదేశాల్లో కూడా మన నాట్య కళ లను అభ్యసించుతూ ,ప్రదర్శనలు ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. తదుపరి 50 మందికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా మెమొటోలు, సర్టిఫికెట్లను,మెడల్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, కళాకారులు, కమలా బాలాజీ, రామ లాలీత్య, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img