విశాలాంధ్ర ధర్మవరం:: మండల పరిధిలోని గోట్లూరు గ్రామంలో గల అనాధాశ్రమంలో బెంగళూరుకు చెందిన ఇంజనీర్ తన సొంత గ్రామమైన ధర్మవరం మండలం నేలకోట మురళి తన తండ్రి నేలకోట ఆదినారాయణ రెడ్డి జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమాన్ని వారు చేపట్టారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలో జరిగే శుభకార్యాలకు తప్పనిసరిగా అనాధాశ్రమంలో వేడుకలు నిర్వహించుకుంటే మానవతా విలువలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. తదుపరి ఆశ్రమ నిర్వాహకులు ప్రఫుల్ల చంద్ర ఇంజనీర్ కు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పద్మావతమ్మ, మారక మురళీధర్ రెడ్డి, స్వర్ణలతారెడ్డి, రాహుల్ రెడ్డి, ధన్విశ్ రెడ్డి, తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.