జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్
విశాలాంధ్ర -అనంతపురం : ఏపీఎస్ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఏపీఎస్ఆర్టీసీ డిపార్ట్మెంటల్ యాక్టివిటీలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అనంతపురం నుంచి హైదరాబాద్, బెంగళూరులకు వోల్వో బస్సులను ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలను పంపించాలన్నారు. ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లకు స్కిల్ డెవలప్మెంట్ నుంచి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రాయితీ పాసులపై విస్తృతంగా అవగాహన కల్పించాలని, బాలికలకు పాసుల విషయమై తెలియజేసేలా, వారు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకునేలా చూడాలన్నారు. ఆర్టీసీ యాక్టివిటీల గురించి పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం సుమంత్, డిపిఓ ప్రభాకర్ రావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ ఎహసాన్ భాష, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.