ఏపీటీఎఫ్ డిమాండ్
విశాలాంధ్ర ధర్మవరం:; ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 117 జీవోను వెంటనే రద్దు చేయాలని ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు సానే రవీంద్ర రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల విలీనం చేపట్టి ప్రాథమిక విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన జి . ఓ. 117 ను వెంటనే రద్దు చేయాలని వారుడిమాండ్ చేశారు. జి. ఓ. 117 ద్వారా వేలాది పాఠశాలలు సింగల్ టీచర్ స్కూళ్లు గా మారిపోయాయని, టీచర్ల కొరతతో మంచి చదువులు అందక విద్యార్థులు, మరో గత్యంతరం లేక పేద తల్లి తండ్రులు నలిగిపోతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ అందుబాటు తగ్గి, ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాల పిల్లలు డ్రాప్ అవుట్స్ అవుతున్నారు అని తెలిపారు. వీలీనం వల్ల అటు ఉన్నత పాఠశాలలు కూడా సతమతమవుతున్నాయి ప్రభుత్వంపై మండిపడ్డారు. జీ. ఓ. నం.117ను రద్దు చేసి, ప్రభుత్వ పాఠశాలకు పూర్వ వైభవం తీసుకు రావాలని, మున్సిపల్ పాఠశాలలకు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని, అప్గ్రేడ్ అయిన ఉన్నత పాఠశాలలకు ఉపాద్యాయ పోస్టులు కేటాయించాలని, జీవో నెంబర్ 55/విద్య : 23.04.2011 ప్రకారం ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లను కేటాయించా అన్నారు. బోధనేతర కార్యక్రమాల నుండి ఉపాధ్యాయులను తప్పించి, అన్ని రకాల యాప్లను రద్దుచేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అన్ని ఉన్నత పాఠశాలల్లో తెలుగు, ఇంగ్షీషు మీడియంలను సమాంతరంగా కొనసాగించాలని, ఉపాధ్యాయుల బదిలీలలో రాజకీయ జోక్యం లేకుండా నివారించేందుకు బదిలీల చట్టం రూపొందించాలని, తెలిపారు. 2024 డీఎస్సీ నోటిఫికేషన్ లో అప్రెంటీస్ విధానం లేకుండా చూడా లన్నారు.
మున్సిపల్ ఉపాధ్యాయుల పి. ఎఫ్. సమస్యపై మున్సిపల్ అధికారులు తగు నిబంధనలు రూపొందించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమం లో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్. శ్రీనివాసులు,జగదీష్, నాగభూషణ, వెంకటేష్, అమానుల్లా,చెన్నుడు,అంజి నాయక్, చంద్ర శేఖర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.