Monday, May 20, 2024
Monday, May 20, 2024

ఉత్తమ డ్రైవర్లగా ముగ్గురు ఎంపిక.. అభినందనలు తెలిపిన డిపో మేనేజర్ సత్యనారాయణ

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ధర్మవరం ఆర్టీసీ డిపోలో ఏప్రిల్ నెలలో ఉత్తమ డ్రైవర్లుగా ముగ్గురిని ఎంపిక చేయడం జరిగిందని, వారిలో ఎం. నారాయణ, వి. ఆంజనేయులు, ఆర్ఎస్. రాజు కలరని తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ముగ్గురు డ్రైవర్లు ఉత్తమ డ్రైవర్లగా ఎంపిక కావడం పట్ల డిపో మేనేజర్ సత్యనారాయణ తో పాటు కార్యాలయ అధికారులు, సిబ్బంది, డిపో అధికారులు, డిపో మెకానికులు, సిబ్బంది అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి డ్రైవరు వీరిని ఆదర్శంగా తీసుకొని, మంచి కేఎంపిఎల్ సాధిస్తూ డిపో ఆదాయ అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు. అదేవిధంగా ఎం. నారాయణ 5.63 కేఎంపిఎల్ తీసుకొని రాగా, వి ఆంజనేయులు 5.87 కేఎంపిఎల్, ఆర్ఎస్ రాజు 5.65 కేఎంపిఎల్ తీసుకొని రావడం జరిగిందని తెలిపారు. వీరందరికీ డిపో మేనేజర్ నగదు పారితోషకాలను అందించడం జరిగిందన్నారు. అనంతరం తోటి మిత్రులు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img