ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నామాల నాగార్జున
విశాలాంధ్ర ధర్మవరం:: శ్రీ సత్య సాయి జిల్లాలో ముందస్తుగా ప్రచారాలు అడ్మిషన్లను అరికట్టడంలో విద్యాశాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నామాల నాగార్జున తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నియమ నిబంధనలను తుంగలో తొక్కి, లంచాలకు అలవాటు పడ్డ విద్యాశాఖ అధికారులు ఏమాత్రం స్పందించకపోవడం దారుణం అన్నారు. కేవలం ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు మాత్రమే నియమ నిబంధనలు పాటిస్తున్నాయని, ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు ఏమాత్రం పట్టించుకోకుండా, ధనార్జనయ ధ్యేయంగా, తల్లిదండ్రుల ఇళ్ల వద్దకు వచ్చి, రంగురంగుల కరపత్రాలను పంచుతూ మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. అంతేకాకుండా పాట చాలా లోనే పుస్తకాలవిక్రయం చేసినా కూడా పట్టి పట్టినట్లు మండలాల విద్యాశాఖాధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారి పట్టించుకోకపోవడం ఏ మనలో వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు. మామూలు మత్తులో జిల్లా మండల విద్యాశాఖ అధికారులు స్పష్టంగా ఉన్నట్లు అర్థమవుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల కళాశాలలో నాణ్యమైన విద్యను అందిస్తూ అత్యున్నత ఫలితాలను అందిస్తున్న కూడా, తల్లిదండ్రులు ప్రైవేటు కు తమ పిల్లలను పంపడం సమంజసం కాదని తెలిపారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు ప్రభుత్వ కళాశాల పాఠశాలల్లోనే చేర్పించాలని, ప్రైవేటు పాఠశాలలు ముందస్తు అడ్మిషన్లు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.