Friday, May 3, 2024
Friday, May 3, 2024

ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు

అవగాహన కల్పించుటలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు. ఫైర్ ఆఫీసర్ రాజు
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రమాదాల నివారణలో అవగాహన తప్పనిసరి అని, ఆ అవగాహన వల్ల ప్రాణ నష్టము, ఆస్తి నష్టము ఉండదని , అగ్నిమాపక వారోత్సవాల్లో గత వారం రోజుల నుంచి ప్రజలందరికీ ప్రమాదాల నివారణ పై అవగాహన కల్పించడం జరిగిందని, ఇందుకు సహకరించిన వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ను ఫైర్ ఆఫీసర్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా అగ్నిమాపక వారోత్సవాల్లో సందర్భంగా శనివారం చివరి ఏడవరోజు పట్టణంలోని ఎర్రగుంటలో గల జి టి ఆర్ హెచ్ పి గ్యాస్ ఏజెన్సీ నందు పనిచేస్తున్న సిబ్బందికి యాజమాన్యానికి, అగ్ని ప్రమాదాల గూర్చి, వాటిలోని రకాల గూర్చి, తీసుకోవలసిన జాగ్రత్తలు గూర్చి మాక్ డ్రిల్ ద్వారా చూపించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వాటర్ డెమో ద్వారా తెలియజేయడం జరిగిందని తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని ఆరిపే పద్ధతులు కూడా తెలపడం జరిగిందన్నారు. అనంతరం అగ్ని ప్రమాదాల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించవలసిన విధి విధానాలను తెలిపే కరపత్రాలను బ్రోచర్లను కూడా పంపిణీ చేయడం జరిగిందని వారు తెలిపారు. ప్రస్తుతం వేసవి కాలం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించాలని తెలిపారు. అదేవిధంగా వ్యాపారస్తులు, ఇతర వాణిజ్య సంస్థలు విద్యుత్ వినియోగంలో తగిన జాగ్రత్తలను తీసుకుంటూ, రాత్రిపూట దుకాణంలో ఉండే విద్యుత్తును ఆఫ్ చేసి తాళాలు వేసుకొని వెళ్లాలని ప్రతి ఒక్కరూ అగ్నిమాపక పరికరాలను తప్పనిసరిగా ఉంచుకోవాలని, తద్వారా ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో హెచ్.పీ గ్యాస్ యాజమాన్యం, సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img