Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలి… శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్

విశాలాంధ్ర ధర్మవరం:: ప్రతి ఒక్కరూ సేవా భవాని అరవర్చుకొని మానవతా విలువలు పెంపొందించేలా కృషి చేయాలని శ్రీ సత్యసాయి సేవా సమితి నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 360 మందికి భోజనపు ప్యాకెట్లను, వాటర్ ప్యాకెట్లను ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ఈ సేవా కార్యక్రమానికి దాతగా కీర్తిశేషులు దాసరి తులసమ్మ వారి కుటుంబ సభ్యులు నిర్వహించడం పట్ల కృతజ్ఞతలను తెలియజేశారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్లను కూడా పంపిణీ చేయడం జరిగిందని వారు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ మాధవి మాట్లాడుతూ ఇప్పటికే శ్రీ సత్యసాయి సేవా సమితి వారు దేశవ్యాప్తంగా ఎన్నో సేవలను కొనసాగిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయమని, నేడు భోజన పంపిణీ చేయడం రోగులకు వరంగా మారిందని తెలిపారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, రోగులు తరఫున శ్రీ సత్య సాయి సేవ సమితి నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 27 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img