Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

రోగులకు సేవ చేయుట లో ఎంతో తృప్తి ఉంది

శ్రీ వాసవి నారాయణ సేవా సమితి అధ్యక్షులు ఓ వి ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం:: రోగులకు సేవ చేయుటలో ఎంతో తృప్తి ఉందని శ్రీ వాసవి నారాయణ సేవా సమితి అధ్యక్షులు ఓ వి ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, సహాయకులకు 300 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీ వాసవి నారాయణ సేవా సమితి నిర్వాహకులు మాట్లాడుతూ ధర్మవరం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దాతల సహాయ సహకారంతో ఈ కార్యం చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం ప్రభుత్వాసుపత్రి సూపర్డెంట్ మాధవి మాట్లాడుతూ వాసవి నారాయణ సేవా సమితి సేవలు అనన్యమైనవని, తదుపరి సేవా సమితి వారికి ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, రోగులు తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకుమాని సాగర, కాకుమాని శ్రీహరి, బాలాజీ, గర్రె బాబు, చిప్పల రఘు ప్రసాద్, ఎతిరాజులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img