Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ప్రతి ఒక్కరూ సైబర్ క్రైమ్ నేరాలను నియంత్రించే దిశగా అడుగు వేయండి..

శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ రత్న

విశాలాంధ్ర- ధర్మవరం : శ్రీ సత్య సాయి జిల్లాలో ప్రజలందరూ కూడా సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కల్పించుకొని నియంత్రించే దిశగా అడుగు పెట్టాలని జిల్లా ఎస్పీ రత్నా తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని కాలేజీ సర్కిల్ నుండి సాయి నగర్ లోని సాయిబాబా కళ్యాణ మండపం వరకు పట్టణంలోని జూనియర్ డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు 1000 మందికి పైగా ర్యాలీలో పాల్గొన్న రు. ఈ ర్యాలీని ఎస్పీ రత్న జండా ఊపి ప్రారంభించారు. అనంతరం ప్రజలందరికీ సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీని నిర్వహించడం జరిగిందని ఎస్పీ తెలిపారు. తదుపరి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన సదస్సులు విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఎక్కువగా జరుగుతున్న వివిధ రకాల సైబర్ క్రైమ్ నేరాలను గమనిస్తూ ఉండాలని భారతదేశంలో ఎక్కువగా ఐదు రకాల నేరాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇందులో డిజిటల్ అరెస్ట్ స్కాం, సైబర్ స్కాములలో ఏజే డిష్ పేకులు, రివార్డ్ పాయింట్లు, కేవైసీ అప్డేట్ లతో అనుసందించబడిన స్కీములు, స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ పెట్టుబడి స్కాం, క్రెడిట్ కార్డ్ మోసం తదితరములు ఉన్నాయని తెలిపారు. తరువాత సైబర్ క్రైమ్ ఏ విధంగా జరుగుతుంది అన్న వాటికి సంబంధించిన వీడియో చిత్రాలను కూడా చూపించడం జరిగిందన్నారు. సైబర్ క్రైమ్ నేరస్తులు ఎల్లప్పుడూ కూడా మోసం చేయాలని తలంపుతోనే ఎక్కువగా చదువుకున్న వాళ్లకు, నిరుద్యోగులకు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లే బలే అవుతున్నారని తెలిపా రు. అప్రమత్తంగా లేకపోతే మీ బ్యాంకు అకౌంట్లో జీరో అవుతుందని, బ్రతుకుతెరువు అతి కష్టంగా మారుతుందని తెలిపారు. నేటి సమాజంలో అన్ని విషయాలపై అవగాహనతో పాటు ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్ నేరాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినప్పుడే అందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. లేనియెడల లక్షలాది రూపాయలు సైబర్ క్రైమ్ వాళ్ళు దోచుకుని పోతారని తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తుల యొక్క నెంబర్స్ నుండి వాట్సాప్ లో సాధారణ మెసేజ్లు కాల్స్ వస్తుంటాయని, మీ ఖాతా యొక్క కేవైసీ అప్డేట్ చేయండి అని మోసపూరిత మాటలతో మోసపోకండి అని తెలిపారు. అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా ప్రజలను ఆకర్షించి ఫేక్ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టిస్తారని, మీ సొమ్ము రెండింతలు అవుతుందని చెప్పి, నమ్మించి, పెట్టుబడులను పెట్టిస్తారని తెలిపారు. అదేవిధంగా క్రెడిట్ కార్డ్ విషయంలో ఆన్లైన్ లావాదేవీలు అధికంగా జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ మోసాలు బాగా పెరుగుతున్నాయని తెలిపారు. బ్యాంకు ఖాతాకు సంబంధించినటువంటి ఎటువంటి వివరాలను కూడా ఎవ్వరికీ తెలియజేయ రాదని, ఫోనులో కూడా ఎవరైనా అడిగినా కూడా చెప్పరాదని తెలిపారు. శ్రీ సత్య సాయి జిల్లాలో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్ లో ఇప్పటివరకు 2543 రిజిస్టర్డ్ అయినాయని, 66 కంప్లైంట్ ఉన్నాయని, ఆర్డర్ ప్రాసెస్ కింద 2477 కలవని, లూజ్ అమౌంట్ కింద రూ.22,12,78,184, హో ల్డ్ అమౌంట్ కింద రూ.3,53,58,625 రూపాయలు కలుదని తెలిపారు. అదేవిధంగా శ్రీ సత్య సాయి జిల్లాలో 162 రిజిస్టర్ అయ్యాయని, లోస్ అమౌంట్ రూ.7,27,31,983, రికవరీ చేసిన అమౌంటు రూ.4,91,000 కలదని తెలిపారు. ఇటువంటి కార్యక్రమం పోలీస్ శాఖ వారు నిర్వహించడం వల్ల జూనియర్, డిగ్రీ కళాశాల, అధ్యాపకులు ప్రిన్సిపాల్ లు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు, డి.ఎస్.పి శ్రీనివాసులు, జిల్లాలోని సైబర్ క్రైమ్ సిఐ అండ్ ఎస్సై, వన్టౌన్ సిఐ నాగేంద్రప్రసాద్, 2 టౌన్ సిఐ రెడ్డప్ప, సబ్ డివిజన్ లో ఉండు ఎస్ఐలు, సిఐలు పాల్గొన్నారు.-

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img