విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరంలో 39వ వార్డుకు చెందిన చేనేత కార్మికుడు ఉడుముల రంగ అప్పుల బాధ భరించలేక చేనేత మగ్గానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.విషయం తెలిసిన మంత్రి సత్యకుమార్ యాదవ్ కార్యాలయ ఇంచార్జ్ హరీష్ బాబు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి కి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు బండారు ఆదినారాయణ,జింకా చంద్రశేఖర్ ల ద్వారా హరీష్ బాబు పది వేల రూపాయలు ఆర్థిక సహాయం అందచేశారు. మీ కుటుంబానికి ఎన్ డి ఏ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షులు సాకే. ఓబిలేసు,నాగభూషణ, మంజునాథ్, పల్లా నవీన్, రాజేంద్ర, రాజు తదితరులు పాల్గొన్నారు.
ఆత్మహత్య చేసుకున్న ఉడుముల రంగా కుటుంబానికి అండగా ఉంటాం…. తెలుగుదేశం పార్టీ నాయకులు…
పట్టణములోని 39వ వార్డు రాంనగర్ లో నివసిస్తున్న చేనేత కార్మికుడు ఉడుముల రంగా చేనేత మగ్గంపై పెట్టిన పెట్టుబడి అప్పులను సకాలంలో చెల్లించలేక ఋణ ఒత్తిడితో ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని టిడిపి శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశారు.ఆత్మహత్య చేసుకున్న రంగా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ఆత్మహత్య చేసుకున్న ఉడుముల రంగా కుటుంబాన్ని అన్ని విధాలుగా ఎన్డీఏ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న రంగా కుటుంబానికి పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు ధర్మవరం పట్టణ నాయకులు 5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు పరీసే సుధాకర్, క్లస్టర్ ఇంచార్జ్ రాళ్లపల్లి షరీఫ్, నాయకులు అత్తర్ రహీం భాష తదితరులు పాల్గొన్నారు.