సేవా భారతి నిర్వాహకులు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని సంజయ్ నగర్లో గల బిఎస్సార్ మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో ఈనెల ఆదివారం ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉచిత సిద్ధ ఆయుర్వేద యోగ వైద్య శిబిరము నాకు విశేష స్పందన రావడం జరిగిందని సేవా భారతి, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ధర్మవరం– తిరుమలేశు, నరేష్ బాబు, దాసరి రామన్న, రవీంద్ర దాస్ లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పక్షవాతమునకు ప్రత్యేక వైద్య నిపుణుల సలహా సూచనలు కూడా ఇవ్వడం జరిగిందని ఈ శిబిరంలో 55 మంది రోగులకు వైద్య చికిత్సలను అందించడం జరిగిందన్నారు.ఈ శిబిరంలో వెన్నెముక నొప్పి, మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, భుజాల నొప్పులు, కీళ్ల నొప్పులు, పక్షవాతం, లివర్, గాల్ బ్లాడర్, కిడ్నీ సమస్యలు, కడుపునొప్పి, వినికిడి లోపం లాంటివి సమస్యలకు వైద్య చికిత్సలను అందించామని తెలిపారు. ప్రముఖ ఆర్తోనీరో ఆకిపచ్చర్ హైదరాబాద్- డాక్టర్ గురూజీ జై శ్రీరామ్ జై ఉచిత చికిత్స ద్వారా రోగాలను వైద్య చికిత్సలను అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సేవా భారతి, తదితరులు పాల్గొన్నారు.