శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ ప్రాంగణంలో ఈనెల 23వ తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నూరవ ఉచిత వైద్య చికిత్స శిబిరమును శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం అధ్యక్షులు బంధనాదం వెంకటరమణ, కోశాధికారి డివి వెంకటేశులు (చిట్టి), ప్రధాన కార్యదర్శి సిరివెళ్ల రాధాకృష్ణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం పార్థసారథి పాల్గొంటున్నారని తెలిపారు. ఈ శిబిరం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రముఖ డాక్టర్లచే వైద్య చికిత్సలతో పాటు ఆరోగ్య సలహాలు ఒక నెలకు సరిపడు మందులను కూడా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు బంధనాదం నారాయణస్వామి జ్ఞాపకార్థం వీరి ధర్మపత్ని లక్ష్మీదేవమ్మ తో పాటు వీరి కుమారులు బంధనాదం వెంకటరమణ అండ్ బ్రదర్స్ వారు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రముఖ డాక్టర్లైన వివేకుల్లయప్ప, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ సాయి స్వరూప్, డాక్టర్ ఎం. సుబ్రహ్మణ్యం, డాక్టర్ డివి జై దీపు నేతలచే వైద్య చికిత్సలను అందించడం జరుగుతుందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పట్టణ గ్రామీణ ప్రాంతాలలోని పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యమును కాపాడుకోవాలని తెలిపారు.