విశాలాంధ్ర -ధర్మవరం:: పట్టణంలోని విజేత అగ్రిటెక్ వేరుశెనగ విత్తన శుద్ధి కేంద్రాలను జిల్లా వ్యవసాయ అధికారి వై వి. సుబ్బారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం వేరుశెనగ కాయల నాణ్యతను వాటికి సంబంధించిన రిజిస్టర్ లను పరిశీలించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ వేరుశనగ విత్తన నాణ్యత ప్రమాణాలను తప్పకుండా పాటించవలసినదిగా విత్తర శుద్ధి యాజమాన్యం ఏపీ సీడ్స్ సిబ్బందిని వారు ఆదేశించడం జరిగిందన్నారు. రైతులకు నాణ్యత గల వేరుశనగ విత్తనాలు ఇస్తేనే వారికి మంచి దిగుబడి వస్తుందని తెలిపారు. ఎటువంటి లోటుపాట్లు ఉన్నా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేరుశనగ విత్తనాలు నాణ్యత లోపం లేకుండా చూసుకోవలసిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ముస్తఫా, సహాయ వ్యవసాయ సంచాలకులు కృష్ణయ్య ,ఏఈఓ లు జగదీష్, అశ్విని ,ఉపేంద్ర, ప్రతిభ ఏపీ సీడ్స్ సిబ్బంది సురేష్, ప్రొసీసింగ్ ప్లాంట్ యజమానులు కొండారెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.