విశాలాంధ్ర- ధర్మవరం ; ప్రభుత్వ కాలేజీల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠ్య పుస్తకాలను తెలుగు అకాడమీ ద్వారా ఉచితంగా సర్పరా చేయడం పట్ల ఇంటర్మీడియట్ విద్యార్థినీ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా పాఠ్య పుస్తకాలతో పాటు నోడల్ ఆఫీసర్ నియామకమును జరపడం నోట్ బుక్స్, బ్యాగులు సరఫరా చేయడం విద్యార్థులకు ఎంతో ఉపయోగ ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా పేద విద్యార్థులకు ఇది ఒక వరంలాగా మారిందని తెలిపారు. విద్యా వ్యవస్థ పట్ల ఈ నూతన ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. ప్రభుత్వ కాలేజీ లతోపాటు కేజీబీవీలు,ఏపీ మోడల్ స్కూల్, ఏపీ గురుకుల పాఠశాలలు, హైస్కూల్లో చదివే విద్యార్థులు కూడా ఇవ్వడం ఎంతో సంతోషించదగ్గ విషయమని తెలిపారు. సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ నోడల్ ఆఫీసర్ గా నియమించడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల విద్యార్థులతో మరింత మెరుగైన విద్య లభిస్తుందని వారు తెలిపారు.