విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం జూటూరు రమణయ్య ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఇటీవల పాత సత్రంలో ఆర్యవైశ్యులు సమావేశమై వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎల్లంపల్లి సుదర్శన్ గుప్తా, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా జూటూరు రమణయ్యను ఎంపిక చేశారు. అధ్యక్ష పదవికి జూటూరు రమణయ్య ఎల్లంపల్లి సుదర్శన్ గుప్తా జయంతి వినోద్ కుమార్ కర్ణాటక ముకుంద గోపా చంద్ర నామినేషన్లు వేయగా, వారితో ఆర్యవైశ్య సంఘం పెద్దలు తీవ్రమైన చర్చలు జరిపారు. అనంతరం పెద్దలు సూచన మేరకు మిగిలిన వారు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. తదుపరి ఎన్నికైన జూటూరు రమణయ్య ను ఎల్లంపల్లి సుదర్శ గుప్తాను సభ్యులు సన్మానించారు. ఎన్నికైన వారు మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని, సమస్యల పరిష్కారానికై ఐక్యమత్యంతో ఉంటామని తెలిపారు. ఈనెల 18వ తేదీన ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు కలవల రాంకుమార్, కలవల మురళీధర్, ఓ వి ప్రసాద్, కాకుమాని శ్రీహరి, కోటి లక్ష్మీ వెంకటేశ్వర్లు, శ్రీహరి, రేపాకుల సురేష్ బాబు, రామకృష్ణ, పెనుజూరు నాగరాజు, బండ్లపల్లి రంగనాథ్, మైలవరం సాయినాథ్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.