విశాలాంధ్ర ధర్మవరం:: బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం కీర్తిశేషులు ఎన్టీ రామారావు అని టిడిపి శ్రేణులు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కమతం కాటమయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం టిడిపి కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు వైభవంగా నిర్వహించుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తదుపరి కమతం కాటమయ్య మాట్లాడుతూ టిడిపి పార్టీ ఆవిర్భావంతోనే ఎన్టీఆర్ రాష్ట్ర ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొని రావడం, ఆయనకు ఆయనే సాటి అని తెలిపారు. పేద ప్రజలన్న ఎన్టీఆర్కు ఎంతో ప్రీతి అని, వారి సమస్యలు పరిష్కరించేందుకు ఎన్నో కష్టాలను ఎదురుకోక తప్పలేదని తెలిపారు. జాతి ఆత్మగౌరవాన్ని కాపాడిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పనీ కుమార్, మద్దిలేటి, నాగూర్ హుస్సేన్, గరుగు వెంగప్ప, అంబటి సనత్, రాయపాటి రవీంద్ర, బొట్టు కృష్ణ, మారుతి స్వామి, రాంపురం శీనా, కేశగాళ్ల శీన, కత్తుల బాబ్జి, కరెంటు ఆది, అడ్ర మహేష్, నారాయణస్వామి, ఉస్మాన్ తో పాటు తెలుగు మహిళలు కూడా పాల్గొన్నారు.