Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

కస్తూరిబా విద్యాలయాల్లో అడ్మిషన్లు ప్రారంభం : ప్రిన్సిపాల్ చంద్రకళ

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని మోటుమర్ల గ్రామంలో గల కస్తూరిబా బాలికల విద్యాలయాల్లో ఆరవ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరము ప్రవేశాలు ప్రారంభం కావడం జరిగిందని ప్రిన్సిపాల్ చంద్రకళ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కస్తూరిబా బాలికల విద్యాలయాలలో ఏడవ, ఎనిమిదవ, తొమ్మిదవ తరగతిలో కూడా చేరేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను భర్తీ చేసి, ఆన్లైన్ ద్వారా వచ్చిన రిసిప్టును మాకు అందజేయాలని తెలిపారు. తదుపరి స్క్రూటీని చేసి ఫైనల్ లిస్టు రూపొందించడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రవేశాల వివరాలను ఫోన్ ద్వారా కూడా సమాచారం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఆన్లైన్లో ap kgbv.apcfss.in వెబ్సైట్లో ఏప్రిల్ 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని వారు తెలియపరిచారు. మా పాఠశాలలో ఆరవ తరగతికి 40 సీట్లు అదేవిధంగా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం సీఈసీ గ్రూపులో 40 సీట్లు కలవని తెలిపారు. ఆన్లైన్లో స్టడీ సర్టిఫికేట్, విద్యార్థి తల్లి, తండ్రి యొక్క ఆధార్ కార్డులు, కుల ధ్రువీకరణ పత్రము, రేషన్ కార్డు, విద్యార్థి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, చిరునామాతో కూడిన ఫోన్ నెంబర్ సమర్పించాలని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్.. 7382464531 కు సంప్రదించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకొని విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img