Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఉచిత కంప్యూటర్ శిక్షణను సద్వినియోగం చేసుకోండి.. విశ్వదీప సేవా సంఘం వ్యవస్థాపకులు కోళ్ల మొరం చంద్రశేఖర్ రెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం:: ఉచిత కంప్యూటర్ శిక్షణను ఆసక్తి గల విద్యార్థినీ విద్యార్థులు గృహిణులు సద్వినియోగం చేసుకోవాలని విశ్వదేపా సేవా సంఘం వ్యవస్థాపకులు కోళ్లమరం చంద్రశేఖర్ రెడ్డి, అధ్యక్షులు గాజుల సురేష్, కార్యదర్శి దేవరకొండ చంద్ర తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఉచిత కంప్యూటర్ శిక్షణ గత కొన్ని సంవత్సరాలుగా నేర్పించడం జరుగుతుందని, వందలాది మంది శిక్షణ పొంది ఉపాధి కూడా పొందుతున్నారని తెలిపారు. పేదరికానికి చదువు, అద్దంకి కారాదన్న ఉద్దేశంతో ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం కీర్తిశేషులు కోలవరం సంజీవరెడ్డి కీర్తిశేషులు నారాయణమ్మల జ్ఞాపకార్థం గత 12 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ, వారి జీవన విధానానికి తోడ్పడటం ఆనందదాయకమని తెలిపారు. గత నెల 17వ తేదీని తరగతుల ప్రారంభమయ్యాయని, కంప్యూటర్ శిక్షణ యందు డి సి ఏ, అడ్వాన్స్, ఎంఎస్ ఆఫీస్, షీ లాంగ్వేజ్, టాలీ, ఫోటోషాప్, తెలుగు, హిందీ టైపింగ్ కోర్సులు కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా మా విశ్వదీప సేవా సంఘములు నేత్రదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. నేత దానం చేయువారు కూడా మమ్మల్ని సంప్రదించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img