Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

రోగులకు సేవ దైవ సేవతో సమానం.. శ్రీ సత్య సాయి సేవ సమితి నిర్వాహకులు

విశాలాంధ్ర ధర్మవరం:: రోగులకు సేవ దైవ సేవతో సమానమని శ్రీ సత్య సాయి సేవ సమితి నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 330 మందికి భోజనపు ప్యాకెట్లను, వాటర్ ప్యాకెట్లను ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది చేతుల మీదుగా వారు అందజేశారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ కీర్తిశేషులు తిప్పన్న జ్ఞాపకార్థం కుమారుడు డివి. సురేష్ వారి సహాయ, సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషించేతగ్గ విషయం అని తెలుపుతూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఆసుపత్రి సూపర్డెంట్ మాధవి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఆసుపత్రిలోని రోగులకు సహాయకులకు శ్రీ సత్య సాయి సేవ సమితి వారు చేస్తున్న సేవలు మరుపురానివని తెలిపారు. ఈ కార్యక్రమం రోగులకు వరం లాగా మారిందని తెలిపారు. అనంతరం ఆసుపత్రి వైద్యులు సిబ్బంది తరపున శ్రీ సత్యసాయి సేవాసమితి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 27 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img