విశాలాంధ్ర -ధర్మవరం : ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ విజిలెన్స్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సహాయ సంచాలకులు పుంగనూరు శివకుమార్, ఏలూరు జిల్లా విజిలెన్స్ శాఖ ఎస్సై రంజిత్ కుమార్ సంయుక్తంగా మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా అండ్ శ్రీ సాయిరాం ఎరువుల దుకాణములను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల పురుగుల మందులు విత్తనాల స్టాకు వివరాలు అనుమతులను వారు తనిఖీ చేశారు. స్టాప్ వ్యత్యాసం వల్ల 23.075 మెట్రిక్ టన్నుల రూ.5,67,800 విలువైన ఎరువులను జప్తు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. అలాగే 22 లీటర్ల 92000 విలువగల పురుగుల మందుల విక్రయాలను నిలుపుదల చేయడం జరిగిందని1.52 క్వింటాళ్ల విత్తనాలు రూ.54,300 విలువ గల విక్రయాలు నిలుపుదల చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి రైతుకు బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలని, ఎమ్మార్పీ రేటుకే విక్రయాలు చేయాలని, లేని పక్షంలో చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు ధర్మవరం కృష్ణయ్య, మండల వ్యవసాయ అధికారి ముస్తఫా, టెక్నికల్ ఏవో రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.