రిటైర్డ్ తెలుగు పండిట్ జయసింహ
విశాలాంధ్ర ధర్మవరం:: రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యము మహత్తర సందేశం అని రిటైర్డ్ తెలుగు పండిట్ జయ సింహ పేర్కొన్నారు. అనంతరం వారు రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మదినం సందర్భంగా మాట్లాడుతూ వీరి రచనలలో గీతాంజలి చాలా గొప్పదని, సాహిత్యంలో ఇది గొప్ప రచన అని తెలిపారు. మానవున్ని కృంగదీసే నిరాశ, నిస్సృహలను, సకల సృష్టిని ప్రేమ భావంతో చూచి శ్రమ యొక్క గొప్పతనాన్ని సూచించే మహత్తర సందేశం గీతాంజలి లోని ముఖ్యాంశము అని తెలిపారు. ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మన గలుగుతుందో, అక్కడ సంపద విద్య అపారంగా లభిస్తుందని తెలిపారు. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో అక్కడ మనశ్శాంతి లభిస్తుందని తెలిపారు. ఇలాంటి రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి సాహిత్య కవులు మరల జన్మించాలని తెలిపారు.