రైతు సంఘం శ్రీ సత్యసాయి జిల్లా సమితి, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి- జే వి రమణ
విశాలాంధ్ర ధర్మవరం:: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రద్దు చేసినందుకు ఏపీ రైతు సంఘం శ్రీ సత్యసాయి జిల్లా, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జే వి. రమణ హర్షం వ్యక్తం చేస్తూ తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ,ప్రజలకు అనేక రకాలుగా నష్టాలు, ఇబ్బందులు కలిగే విధంగా భూ హక్కుల చట్టం అమలు చేసేందుకు గత ప్రభుత్వం ప్రయత్నం చేసినదని ,ఆ యొక్క చట్టం వలన రైతులకు ,ప్రజలకు అనేక రకాలుగా ఇబ్బందులు ఉంటాయన్న విషయాన్ని మొదటగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర సమితి గుర్తించి, ఆ చట్టాన్ని రద్దు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ,నిరసనలు నిర్వహించడం జరిగిందన్నారు.ప్రభుత్వానికి అనేక రూపాలలో విజ్ఞప్తులు చేయడం జరిగిన ఫలితం లేదని తెలిపారు .కానీ గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం చేసిన విజ్ఞప్తులను, ఆందోళనలను పెడచెవిన పెట్టిందని, అప్పట్లో
ప్రతిపక్షంలో ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ వలన రైతులు, ప్రజలు ఇబ్బందులు పడతారని గుర్తించి,ఎన్నికల ప్రచారంలో భాగంగా మేం అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అధికారం లోకి రాగానే చెప్పిన హామీ ప్రకారంగా ఆ చట్టాన్ని రద్దు చేయడం నిజంగా అభిలాష నియమన్నారు.
ల్యాండ్ టైటాలింగ్ యాక్ట్ రద్దు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు, అనేక రూపాలలో ఆందోళన కార్యక్రమాల్లో నిర్వహించి, రైతుల పక్షాన, ప్రజల పక్షాన నిలిచినందుకు వారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ముఖ్యంగా బ్యాంకులలో ఉన్న అన్ని రకాల అప్పులను మాఫీ చేయాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, సాగు కోసం అధనంగా అప్పులు చేస్తున్నారని, సాగు కోసం ప్రతి రైతు వారికున్న బంగారం బ్యాంకులలో తాకట్టు పెట్టడం జరుగుతున్నదని , పంటలకు గిట్టుబాటు ధరలు లేక బ్యాంకులలో ఉన్న బంగారంను విడుదల చేసుకోలేక ,వారి పిల్లలకు వివాహాలు చేయలేక మానసికంగా ఆందోళనలకు గురి అవుతున్నారని బాధని వ్యక్తం చేశారు. కావున ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులు వలసలు వెళ్లకుండా, ఆత్మహత్యల పరంపర కొనసాగకుండా ఉండడానికి చర్యలు చేపట్టాలని ,రైతులకు అవసరమైన ఉచిత విద్యుత్తును అందించి ,విత్తనాలను ,ఎరువులను డ్రిప్ ఇరిగేషన్ సిస్టం 90 శాతము సబ్సిడీతో సబ్సిడీ అందించి రైతులను అన్ని రకాలుగా ఆదుకోవాలని, బ్యాంకులలో రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని, అదేవిధంగా డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసు అమలు చేసి, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని తెలిపారు. 50 సంవత్సరాలు పూర్తయిన ప్రతి రైతుకు పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, ప్రభుత్వం ప్రతి రైతుకు సంవత్సరానికి 20వేల రూపాయలు సాగు సాయం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగినది అని తెలిపారు. ఆ విధంగా కాకుండా సాగు సాయం కింద ప్రతి ఎకరంనకు పదివేల రూపాయలు సాయం చేయాలని, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.