జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినతి పత్రాన్ని అందజేసిన వైనం
విశాలాంధ్ర ధర్మవరం: శ్రీ సత్య సాయి జిల్లా కస్తూరిబాగాంధీ బాలిక విద్యాలయముకు చెందిన K.G.B.V ఉద్యోగులు సమస్యలను తీర్చాలని కోరుతూ శంకరమ్మ,గీత సువర్ణ లక్ష్మి, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరకం మధుసూదన్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ
కేజీబీవీ ఉద్యోగుల ప్రధాన సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా 352 కేజీబీవీ ఉద్యోగులలో 4579 మంది ఉద్యోగులుగా 2005 వ సంవత్సరం నుండి కొనసాగుతున్నారని, అప్పుడు మా కష్టాన్ని గుర్తించి 2018 లో తెలుగుదేశం ప్రభుత్వం కేజీబీవీ స్టాప్ కి వర్తింపజేయమని ఉత్తర్వులు నెంబర్24 తో ఎం టి ఎస్ ఇవ్వండి అని ఆర్డర్ ఇవ్వడం జరిగిందని, కానీ ఆ తర్వాత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక ఆ జీవోను రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్సార్సీపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మమ్మల్ని క్రమబద్ధకరిస్తారని చెప్పి మమ్మల్ని మోసం చేయడం జరిగిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా మాకు న్యాయం జరుగుతుందని భావించి, మీకు సమస్యలను తెలుపుతూ వినతిపత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. అనంతరం చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తప్పకుండా మీ సమస్యలు జనసేన పార్టీ అధ్యక్షులు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి తప్పకుండా మీ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు.