Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

ఇంటర్మీడియట్లోప్రతిభ ఘనపరిచిన కస్తూరిబా కళాశాల విద్యార్థినిలు

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని మోటుపరల గ్రామం వద్దగల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం లో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబరిచారని ప్రిన్సిపాల్ చంద్రకళ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా కళాశాలలో కేవలం సీఈసీ గ్రూపు మాత్రమే ఉన్నదని, ఈ గ్రూపులో మొదటి సంవత్సరం 35 మందికి 18 మంది పాస్ కావడం జరిగిందని, 51.4 శాతము, అదేవిధంగా ద్వితీయ సంవత్సరంలో 22 మందికి గాను 12 మంది ఉత్తీర్ణులు కావడం జరిగిందని, 54.5 శాతం నమోదు కావడం జరిగిందన్నారు. ఇందులో టాపర్గా ప్రథమ సంవత్సరం సీఈసీ లో కె. తనూజ లక్ష్మి447/500, ద్వితీయ సంవత్సరంలో బి. వైశాలి 808/1000 మార్కులు కైవసం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపకులు, తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img