Friday, May 17, 2024
Friday, May 17, 2024

హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి… మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పద్మశ్రీ

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని గుట్ట కింద పల్లి లో గల మోడల్ స్కూల్లో ఆరవ తరగతి ప్రవేశాలకు సంబంధించిన పరీక్షల యొక్క హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయని ప్రిన్సిపాల్ పద్మశ్రీ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ 2024-25 సంవత్సరానికి ప్రవేశానికి సంబంధించిన ఈ పరీక్ష ఈనెల 21వ తేదీన ఉదయం 10 నుండి 12 గంటల వరకు జరుగుతుందని వారు తెలిపారు. కావున పరీక్షకు హాజరు ఆగు విద్యార్థులు అందరూ కూడా ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు. హాల్ టికెట్లను apms.apcfss.in వె బ్సైట్లో పొందుపరచడం జరిగిందని, వాటిని విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img