విశాలాంధ్ర- ధర్మవరం: ఎస్కే యూనివర్సిటీ ప్రకటించిన ఆరవ సెమిస్టర్ లో పట్టణంలోని శ్రీ సాయి డిగ్రీ కళాశాల విద్యార్థులు విజయదుందుభి మోగించడం జరిగిందని కళాశాల కరెస్పాండెంట్ చాంద్ బాషా, ప్రిన్సిపాల్ ఫణి కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సెమిస్టర్ ఫలితాలలో పట్టణములోనే ప్రథమ స్థానంలో నిలవడం మాకెంతో గర్వంగా, సంతోషంగా ఉందని తెలిపారు. బీఎస్సీ బీకాం బీబీఏ నందు జె. నరేంద్ర కుమార్, కే. స్వాతి, జి. గౌతమి, ఎస్. మహేశ్వరి, పి. దీప్తి ,ఎస్. పరిన్తాజ్ లు 94 శాతం సాధించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఎస్.సౌమ్య 92 శాతం, జి. ఉష 91 శాతం, సి జయశ్రీ సి. శివతేజ, పి . ఆరతి, పి. చార్మి, వీ. రుక్మిణి 90 శాతం సాధించగా, బి. చరణ్ కుమార్, ఈ. భార్గవ్ సాయి, జి గాయత్రి, కే. భారతి, జి. శివమణి, సి. తిరుమల నాథ్, టీ. పూజిత, జె. దివ్యశ్రీ 89 శాతము మార్కులు సాధించడం జరిగిందని తెలిపారు. కే.సునీత బి. గాయత్రి 88 శాతము, ఎస్. హారిక 85 శాతము, మరి కొంతమంది విద్యార్థులు 82 శాతం నుండి 71 శాతం వరకు మంచి ప్రతిభను ఘనపరచడం జరిగిందని తెలిపారు. ఈ విధంగా ప్రతిప కనపరిచి కళాశాలకు తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావడం సంతోషించదగ్గ విషయము అని తెలిపారు. అనంతరం విద్యార్థులకు స్వీట్ లను పంపిణీ చేశారు. తదుపరి పేరుపేరునా విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు డాక్టర్ బి. సుబ్బారావు, పోలా ప్రభాకర్, అక్రమ్, బండ్లపల్లి రంగనాథ్, రమణ పాల్గొన్నారు.