London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Thursday, October 24, 2024
Thursday, October 24, 2024

దేశంలో పార్టీ కార్యకర్తలకు అండగా ఉండేది ఒక టిడిపి మాత్రమే

టిడిపిలో సభ్యత్వం అంటే జీవితానికి ఒక భరోసా

సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమంలో పరిటాల శ్రీరామ్

నాలుగు నెలల తర్వాత పార్టీ మనకు ఇచ్చిన బాధ్యత ఇది

ధర్మవరం నియోజకవర్గ సభ్యత్వ నమోదులో ముందుండేలా చూద్దాం
విశాలాంధ్ర ధర్మవరం: దేశంలో కార్యకర్తలకు అండగా ఉండే ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు అంశంపై ధర్మవరంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి ముఖ్య నాయకులంతా తరలివచ్చారు. సభ్యత్వ నమోదు ఎందుకు చేయాలి?.. దాని వలన ప్రయోజనం ఏంటి? అన్న అంశాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా ఉంటే.. సమాజంలో గౌరవం మాత్రమే కాదని వారికి వ్యక్తిగతంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ప్రజల కోసం ఎంతో బాధ్యతాయుతంగా పనిచేసే పార్టీలో ఉన్నామనే గర్వం మనకి ఎప్పటికీ ఉంటుందన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలని.. మన పార్టీ సానుభూతిపరులుగా ఉన్న వారు కూడా సభ్యత్వం తీసుకునేలా చొరవ తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీలో ఏవైనా నామినేటెడ్ పదవులు కావాలన్నా లేక స్థానిక సంస్థల్లో అవకాశం ఇవ్వాలన్న సభ్యత్వ నమోదు కచ్చితంగా ఉండాలన్నారు. టిడిపిలో వంద రూపాయలు కట్టి సభ్యత్వ నమోదు తీసుకుంటే ఐదు లక్షల వరకు బీమా సౌకర్యం ఉంటుందని శ్రీరామ్ వివరించారు. గతంలో రెండు లక్షల రూపాయలు ఉన్నదానిని ఇప్పుడు ఐదు లక్షల వరకు పెంచారన్నారు. కుటుంబ పెద్దకు ఏదైనా అనుకోకుండా ఇబ్బంది కలిగితే వారి పిల్లలకు ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా విద్యనందించే బాధ్యత కూడా టిడిపి తీసుకుంటుందన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం ఇలా ఎన్నో కార్యక్రమాలు నారా లోకేష్ తీసుకొచ్చారని శ్రీరామ్ వివరించారు. ఎన్నికలకు ముందు మనం ఎన్డీఏ గెలుపే లక్ష్యంగా పనిచేశామని… ఇప్పుడు నాలుగు నెలల తర్వాత పార్టీ మనకు ఈ బాధ్యత ఇచ్చిందన్నారు. అందుకే ధర్మవరం నియోజకవర్గాన్ని సభ్యత్వ నమోదులో ముందు వరుసలో ఉండేలా చూద్దామని… ఇందుకోసం వార్డు స్థాయి నుంచి ప్రతి ఒక్కరు కృషి చేయాలని శ్రీరామ్ పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img