Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Monday, September 30, 2024
Monday, September 30, 2024

ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తోనే రాష్ట్ర అభివృద్ధి

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రము అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ప్రజలకు పూర్తి న్యాయం జరుగుతుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి బిజెపి ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా నియమించబడి మొదటిసారిగా ధర్మవరం వచ్చిన సందర్భంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తో పాటు నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు, సత్య కుమార్ యాదవ్ కి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు తమదైన శైలిలో ప్రధానమైన కూడలిలో టపాసులను పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. తదుపరి బైక్ ర్యాలీ నిర్వహిస్తూ జై భారత్ మాతాకీ జై, పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వర్ధిల్లాలి అన్న నినాదాలు మారుమోగాయి. అనంతరం సత్య కుమార్ యాదవ్ తో చిలక మధుసూదన్ రెడ్డి తన నాయకులను కార్యకర్తలతో శుభాకాంక్షలు సత్య కుమార్ యాదవ్ కు తెలియజేశారు. అనంతరం వారి వెంట వెళుతూ, పట్టణంలోని పలు దేవాలయాల్లో పూజలు కూడా నిర్వహించారు. సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ జనసేన టిడిపి నాయకులు కార్యకర్తల సహాయ సహకారములతో తాను అత్యంత మెజారిటీతో గెలిచి మీ అందరి ఆశీస్సులతో రాష్ట్ర మంత్రి కావడం జరిగిందన్నారు. ధర్మవరం నియోజకవర్గ సమస్యలను తప్పకుండా పరిష్కరించే దిశలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి న్యాయం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img