విశాలాంధ్ర ధర్మవరం:: పేదలకు వైద్య సేవలు చేయడంలోనే ఎంతో సంతృప్తి ఉందని యువర్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం, కోశాధికారి బండి నాగేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో యువర్ ఫౌండేషన్ సౌజన్యంతో, జిల్లా ఆంధత్వ నివారణ సంస్థ శ్రీ సత్యసాయి జిల్లా సహకారంతో, నేత్రాలయ ఐ క్లినిక్ సహకారంతో, పుష్పగిరి కంటి ఆసుపత్రి కడప వారిచే ఉచిత కంటి వైద్య శిబిరమును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ చీరల వ్యాపారి సందా రాఘవ, జింకా పురుషోత్తం పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలోనే కాకుండా గ్రామాలలోనూ ఇతర జిల్లాలలోనూ సేవా కార్యక్రమాలు చేయడం గర్వించదగ్గ విషయం అని తెలుపుతూ ఆ సంస్థను వారు అభినందించారు. అంతేకాకుండా యువర్ ఫౌండేషన్ కంటి శిబిర కార్యక్రమాలతో పాటు వివిధ కార్యక్రమాలను కూడా చేయడం నిజంగా సంతోషించదగ్గ విషయం అని తెలిపారు. మా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. అనంతరం యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర మాట్లాడుతూ ఈ శిబిరంలో 95 మందికి కంటి వైద్య చికిత్సలు అందించగా, అందులో 58 మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. వీరందరికీ కూడా ఉచిత ఆపరేషన్ తో పాటు ఉచితంగా అద్దాలు కూడా ఇవ్వబడును అని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువర్ ఫౌండేషన్ సహకార దర్శి నాగర్జున, పిఆర్ఓ రాధాకృష్ణ, డాక్టర్ సుబ్బారావు, క్యాంపు చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, చాంద్ భాషా, స్టార్ ఖలీల్, సత్రశాల మల్లికార్జున, గర్రె రమేష్ బాబు, పోలా ప్రభాకర్, బండ్లపల్లి రంగనాథ్, వైకె శ్రీనివాసులు, ఓవి ప్రసాద్, రామచంద్ర గుప్తా, ఆప్తమాలజీ టెక్నీషియన్ నాగరాజా తదితరులు పాల్గొన్నారు.