విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని తమ్మాపురం వాటర్ వర్క్స్ నందు మనీ ఫోర్డ్ పైప్ లైన్ లీకేజ్ కావడంతో భారీగా నీరు వృధాగా పోతున్నాయని, కావున పైపులైన్ మరమ్మత్తు కోసం వెల్డింగ్ చేయాల్సి ఉందని, అలాగే సుబ్బారావు పేట దగ్గర కూడా పైప్ లైన్ లీకేజ్ కావడం వల్ల నీరు వృధాగా పోతున్నాయని, వీటన్నింటినీ మరమ్మత్తులు చేసేందుకు సమయం కావాల్సి ఉన్నందున ఈ నెల 20వ తేదీ శనివారం ఉదయం 7 గంటల నుండి నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రామ్కుమార్ తెలిపారు. మరమ్మత్తులు పనులు పూర్తీ అయిన వెంటనే నీటి సరఫరా చేయబడునని తెలిపారు. కావున ప్రజలు గమనించి సహకరించవలసినదిగా వారు తెలిపారు.