Friday, October 25, 2024
Friday, October 25, 2024

ప్రజలందరికీ నాణ్యమైన నిత్యావసర సరుకులను అందిస్తాం..

ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం:: ప్రజలందరికీ నాణ్యమైన సరియైన దూకంతో ఉండిన నిత్యావసర సరుకులను తప్పక పంపిణీ చేస్తామని ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాలు జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు డివిజన్ పరిధిలోని చెన్నై కొత్తపల్లి, ధర్మవరం, ముదిగుబ్బ మండలాలలోని స్టాక్ పాయింట్స్ ను వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ పాయింట్ లో ఉన్న కందిపప్పు, నూనె, ల్యాండ్ మై గా చెక్ చేయడం జరిగిందని తెలిపారు.పంచదార యొక్క నిల్వ రిజిస్టర్ ను కూడా తనిఖీ చేసి, అక్కడక్కడ ఉన్న వాటిని తూకాలను చూసి పరిశీలించారు. ఎక్కడ ఎటువంటి పొరపాటు లేకుండా హెచ్చు,తగ్గులు తూకం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్టాక్ పాయింట్ సిబ్బందికి ఆదేశించడం జరిగిందని తెలిపారు. మా పరిశీలల్లో ఎటువంటి లోపాలు లేవని, ఉన్న విషయాన్ని కలెక్టర్ కార్యాలయానికి పంపడం జరుగుతుందని తెలిపారు. మున్ముందు కూడా తనిఖీలు నిర్వహించి, ప్రజలకు సరి అయిన తూకంతో నిండిన నిత్యవసర సరుకులను, తప్పక పంపిణీ చేసే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు లక్ష్మీదేవి, శారద, రమాదేవి, అంపయ్య, ఈశ్వరయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img