విశాలాంధ్ర- ధర్మవరం:; పేద ప్రజల గుండెల్లో నిలిచిన మహనీయుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి అని, రైతులకు ఉచిత విద్యుత్తు అందించి వ్యవసాయాన్ని పండుగ చేయడం జరిగిందని వైఎస్ఆర్సిపి నాయకులు, కౌన్సిలర్లు గుర్రం శ్రీనివాసరెడ్డి, చందమూరి నారాయణరెడ్డి, మాసపల్లి సాయికుమార్, కోటిరెడ్డి బాలిరెడ్డి, ఉడుముల రామచంద్ర, చాంద్ బాషా, నారాయణరెడ్డి, మేడాపురం వెంకటేష్ తదితరులు తెలిపారు. ఈ సందర్భంగా వారు స్థానిక పిఆర్టి సర్కిల్లో వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో పట్టణంలోని 40 వార్డుల కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు కలిసి వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలను వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలను జరుపుకున్నారు. అదేవిధంగా ఎర్రగుంట వైద్యం లో, శివానగర్ వై జంక్షన్ లో, కొత్తపేట వై జంక్షన్ లో కూడా నాయకులు కార్యకర్తలు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు నాయకులు మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నో సంక్షేమ పథకాలను అందించి పేదరికమును నిర్మూలించడంలో ఒక ప్రత్యేకమైన పాత్రను నిర్వహించే పేద ప్రజల హృదయాలలో గూడుగట్టుకున్నారని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యానికి తలదన్నేలా దేశంలోనే ఆదర్శంగా నిలిచారని తెలిపారు. నిరుపేదలకు పింఛన్లు ఉచిత గృహాలు అందించి ఆదర్శ ముఖ్యమంత్రిగా వారు చరిత్ర సృష్టించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సివి నారాయణరెడ్డి, జయరాం రెడ్డి, భయపరెడ్డి, కడప రంగస్వామి, తొండమాల రవి, గూండా ఈశ్వరయ్య, గజ్జల శివ, కేత లోకేష్, చింత ఎల్లయ్య, చెలిమి పెద్దన్న, కత్తె పెద్దన్న, అజంతా కృష్ణ, శ్రీనివాసులు, దేవరకొండ రమేష్, వేముల అమర్నాథ్ రెడ్డి, చెలిమి రామయ్యతో పాటు 40 వార్డుల ఇన్చార్జులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
కొత్తపేట, సాయిబాబా గుడి ముఖ ద్వారం ఎదురుగా రేగాటిపల్లి రోడ్డు వద్ద, వైయస్సార్ జంక్షన్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు;; కౌన్సిలర్ మేడాపురం వెంకటేష్….. పట్టణంలోని కొత్తపేటలోని వైయస్సార్ జంక్షన్ వద్ద వార్డుకౌన్సిలర్ మేడాపురం వెంకటేష్ ఆధ్వర్యంలో వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతి వేడుకలు పార్టీ నాయకులు కార్యకర్తలు నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. తొలుత విగ్రహానికి పూలమాలవేసి, నివాళులు అర్పించిన తదుపరి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మేడాపురం వెంకటేష్ మాట్లాడుతూ పేద ప్రజల హృదయాలలో చెరగని ముద్రను వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉండిపోయారని, వారు పేద ప్రజలకు చేసిన సేవలను మరువలేనివని, రాజశేఖర్ రెడ్డి ఆశయాలు అనుసరణీయమని తెలిపారు. అనేక సంక్షేమ పథకాలను రాజకీయాలకు అతీతంగా, పేద ప్రజలకు చేర్చిన మహనీయుడు అని తెలిపారు. తొలుత సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి ఇచ్చిన హామీల కన్నా ఎక్కువ వాగ్దానాలను అమలు చేసిన ఘనత వారికే దక్కిందని తెలిపారు. వారి ఆశయ సాధనాల కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.