బిజెపి అధ్యక్షులు- జి. ఎం శేఖర్.
విశాలాంధ్ర – ధర్మవరం:: ఈనెల నాలుగవ తేదీన టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభిమాన నాయకుడు జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ ఈనెల నాలుగవ తేదీన ధర్మవరం పట్టణానికి రానున్నారని, వారి పర్యటనను విజయవంతం చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా బిజెపి అధ్యక్షులు జి. ఎం శేఖర్, జిల్లా విస్తారక్ భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్య కుమార్ యాదవ్ మొట్టమొదటిసారిగా ధర్మారానికి రానున్నారని ప్రతి ఒక్క బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ర్యాలీగా స్వాగతం పలకాలని వారు కోరారు. అదేవిధంగా నియోజకవర్గంలోని బిజెపి నాయకులందరూ కూడా అధిక సంఖ్యలో ర్యాలీలో పాల్గొనాలని తెలిపారు. నాలుగవ తేదీ ఉదయం 9:30 గంటలకు జిల్లాలోని కార్యకర్తలు పెద్ద ఎత్తున వాహనాలలో ధర్మవరం మార్కెట్ యార్డ్ బత్తలపల్లి రోడ్డు వద్దకు రావాలని వారు సూచించారు. అందరికీ వాహనాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కావున బిజెపి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని తెలిపారు.