ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరులో స్వల్పంగా భూమి కంపించింది. బుధవారం రాత్రి 11.23 గంటల సంమయంలో మండల కేంద్రంలో భూకంపం వచ్చింది. అంతా నిద్రలో ఉన్న సమయంలో భూ ప్రకంపణలు రావడంతో జనాలు భయాందోళనలకు గురయ్యారు. ఇండ్లలో నుంచి రోడ్లపైకి పరుగులుతీశారు. రెండు సెకన్లపాటు భూమి కంపించిందని స్థానికులు వెల్లడిరచారు. భూకంప తీవ్రతకు ఇండ్లలోని వస్తువులు కదిలిపోయాయని చెప్పారు. రిక్టర్స్కేలుపై భూకంప తీవ్రత 3.0గా నమోదైందని అధికారులు తెలిపారు. ఉట్నూరు మండల కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని, భూఅంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులు భూకంపం వచ్చినట్లు వెల్లడిరచారు. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.