ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును పొడిగించారు. తెలంగాణ ప్రయివేటు జూనియర్ కాలేజీ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు నవంబర్ 12వ తేదీ వరకు గడువు పొడిగిస్తున్నట్టు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడిరచింది.గవర్నమెంట్, ప్రయివేటు ఎయిడెడ్, ప్రయివేటు అన్ ఎయిడెడ్, కో ఆపరేటివ్, టీఎస్ రెసిడెన్షియల్, టీఎస్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, టీఎస్ ట్రైబల్ వెల్ఫేర్, టీఎస్ మోడల్, టీఎస్ బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, కేజీబీవీ, ఇన్సెంటివ్, కంపోజిట్ డిగ్రీ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశం పొందవచ్చు.