Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

ఇందిరాపార్క్‌ వద్ద షర్మిల దీక్షకు అనుమతి నిరాకరణ

రాష్ట్రంలో పండిరచిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్‌ షర్మిల 72 గంటలపాటు దీక్ష చేయడానికి నిర్ణయించారు. శుక్రవారం నుంచి ఇందిరాపార్క్‌ వేదికగా మూడు రోజులపాటు దీక్ష చేయాలనుకున్నారు. అయితే షర్మిల దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శుక్రవారం ఇందిరాపార్క్‌ వద్ద టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు దీక్షలో పాల్గొంటున్నారు. దీనికి అనుమతి ఇవ్వడంతో షర్మిల దీక్షకు అనుమతి ఇవ్వలేమంటూ పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో కామారెడ్డి నియోజకవర్గంలో దీక్ష చేసేందుకు షర్మిల నిర్ణయించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img