బంజారాహిల్స్ ఫుడిరగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. నాలుగురోజుల కస్టడీలో భాగంగా ఈనెల 14న నిందితులు అభిషేక్, అనిల్ను చంచల్గూడ జైలు నుంచి తీసుకెళ్లి బంజారాహిల్స్ పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. పబ్లో స్వాధీనం చేసుకున్న 4.64 గ్రాముల కొకైన్ గురించి తమకు ఏమీ తెలియదని నిందితులు చెబుతున్నారు. నిందితులు సహకరించకపోవడంతో ఈ కేసును కొలిక్కి తీసుకురావడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. పబ్పై దాడులు, నిందితుల అరెస్టు తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ అవి కేసుకు బలాన్ని ఇచ్చేలా లేకపోవడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. కస్టడీ ముగియడంతో రేపు ఉదయం వైద్య పరీక్షల అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచి తిరిగి చంచల్గూడ జైలుకు తరలించనున్నారు. ఈ కేసులో మరింత సమాచారం సేకరించేందుకు అభిషేక్ను మరోసారి కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది.