Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

మల్లన్న సాగర్‌..మన తెలంగాణకే తలమానికం : మంత్రి హరీశ్‌రావు

తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేందుకు, భవిష్యత్తు ప్రజల అవసరాలను తీర్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్‌, మల్లన్న సాగర్‌ జలాశయం నిర్మాణం చేపట్టినట్లు మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మల్లన్న సాగర్‌ ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో హరీశ్‌రావు ప్రసంగించారు.మల్లన్న సాగర్‌ తక్కువ కాలంలోనే పూర్తి చేసుకున్నదంటే దాని వెనుకాల సీఎం కేసీఆర్‌ కృషి ఉందని అన్నారు. ఈ ప్రాజెక్టు మన తెలంగాణకే తలమానికమని అన్నారు.ఈ ప్రాజెక్టును ఆపాలని సుప్రీం, హైకోర్టుతో పాటు గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో 350 కేసులు వేశారు. సుప్రీంకోర్టు నాలుగేండ్ల క్రితం అన్ని కేసులను కొట్టేస్తూ ఈ రోజున కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చింది.మల్లన్న సాగర్‌ జలాశయం ద్వారా సగం తెలంగాణకు నీళ్లు వస్తాయి. కరువు ఇక ఉండనే ఉండదు. ఈ ప్రాంతం ఒక్కప్పుడు కరువు కాటకాలకు నిలయం. అంబలి కేంద్రాలకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతానికి గోదావరి జలాలను తీసుకొచ్చి సస్యశ్యామలం చేశారు కేసీఆర్‌. ప్రజల అవసరాలు తెలిసిన నాయకుడిగా.. వందేండ్ల భవిష్యత్‌ ఆలోచించి ఈ ప్రాంతంలో మల్లన్న సాగర్‌ను కేసీఆర్‌ నిర్మించారని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img