Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Tuesday, October 1, 2024
Tuesday, October 1, 2024

రాష్ట్రంలో బుల్డోజర్‌ రాజ్యం

. బీజేపీ దారిలోనే కాంగ్రెస్‌
. రాహుల్‌గాంధీకి హరీశ్‌రావు లేఖ

విశాలాంధ్ర -హైదరాబాద్‌ : తెలంగాణలో బుల్డోజర్‌ రాజ్యం నడుస్తుందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ జాతీయ నాయకుడు రాహుల్‌ గాంధీకి మాజీ మంత్రి హరీశ్‌ రావు సోమవారం బహిరంగ లేఖ రాశారు. అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని కాలదన్ని, అధికార దుర్వినియోగంతో దుర్మార్గ, దుష్ట పాలన నడుస్తున్నట్లు పేర్కొన్నారు. మానవత్వాన్ని, న్యాయాన్ని బుల్డోజర్‌తో తొక్కిస్తూ రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడుతున్నట్లు వివరించారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌, హైడ్రా విషయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనంగా పేర్కొన్నారు. మీ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్వర్యంలో నడుస్తున్న నిరంకుశ పాలనకు బుల్డోజర్‌ ప్రతీకగా నిలిచిందని, అది తెలంగాణలో పౌరహక్కులను నిరంతరం ధిక్కరిస్తోందని విమర్శించారు. హైడ్రా, మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టుల పేరుతో పేద, మధ్యతరగతి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏళ్లుగా అన్ని చట్టపరమైన పత్రాలతో నివసిస్తున్న వారి ఇళ్లను టార్గెట్‌ చేస్తూ, భయబ్రాంతులకు గురి చేస్తూ బుల్‌డోజర్‌ పాలన నడుపుతున్నారని మండిపడ్డారు. సహజ న్యాయ సూత్రాలను కాలరాస్తూ ముఖ్యమంత్రి పాలన కొనసాగుతుందని ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్‌, దిల్లీ, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, అస్సాం, మహారాష్ట్ర ల్లో పేదలు, మధ్య తరగతిపై బీజేపీ బుల్డోజర్లను ఎలా ఉపయోగిం చిందో, కాంగ్రెస్‌ కూడా తెలంగాణలో అదే విధంగా ఉపయోగిస్తుందని… బీజేపీ దారిలోనే కాంగ్రెస్‌ నడుస్తుందని ఆరోపించారు. బుల్డోజర్‌ కూల్చివేతలపై సుప్రీం కోర్టు తాజా తీర్పు ఉన్నప్పటికీ, సర్వేలు నిర్వహించకుండా, సరైన విధానాలను అనుసరించకుండా, తెలంగాణలో పేదల ఇళ్లను కూల్చివేస్తూ వారిని కన్నీరు పెట్టిస్తుందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img