కాంగ్రెస్ శ్రేణుల ధర్నా… జగిత్యాలలో ఉద్రిక్తత
విశాలాంధ్రహైదరాబాద్: జగిత్యాల జిల్లా రూరల్ మండలం జాబితాపూర్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. సంతోశ్ అనే వ్యక్తి గంగారెడ్డిని కారుతో ఢీకొట్టి... ఆ తర్వాత కత్తితో పొడిచినట్లు స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ గంగారెడ్డిని స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. రాజకీయ కక్షలే హత్యకు ప్రధాన కారణమని తెలుస్తోంది. దీంతో జగిత్యాల
ధర్మపురి ప్రధాన రహదారిపై బైఠాయించిన జీవన్ రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ తమ్ముడి లాంటి వాడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాలలో బీఆర్ఎస్ రాజ్యం నడుస్తుందా లేదంటే కాంగ్రెస్ రాజ్యం నడుస్తుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ నాయకులకే రక్షణ కరువైందని మండిపడ్డారు. గంగారెడ్డి హత్యతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాబితాపూర్ గ్రామంతో పాటు జగిత్యాలలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కొన్ని రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలతో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై అనేక విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా అంటూ ఏకంగా అధికార పార్టీ సీనియర్ నాయకుడే బహిరంగంగా వ్యాఖ్యానించడం రాష్ట్రంలో హాట్టాపిక్గా మారింది. జగిత్యాల జిల్లా జాబితాపూర్లో కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డిని దారుణంగా హత్య చేశారు. అనేకసార్లు సంతోశ్పై పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న జీవన్ రెడ్డి వెంటనే జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి చేరుకొని గంగారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరోవైపు గంగారెడ్డి హత్యకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. రోడ్డుపై బైఠాయించి హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున రోడ్డుపై నిరసన చేపట్టడంతో పట్టణంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిరది. పోలీసుల తీరుపై జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రాజ్యంలో కాంగ్రెస్ నేతలకే రక్షణ కరువైందని ఆరోపించారు.
మీకూ… కాంగ్రెస్కో దండం
అనుచరుడి హత్యతో జీవన్ రెడ్డి సొంత పార్టీ పైనే ఘాటుగా స్పందించారు. మీకూ, కాంగ్రెస్కో దండం అంటూ విప్ అడ్లూరి లక్ష్మణ్తో ఘాటుగా వ్యాఖ్యానిం చారు. అవమానించారు… మానసికంగా వేధించారు… అయినా భరించాం… కనీసం మమ్మల్ని బతకనివ్వరా… స్వచ్ఛంద సంస్థ పెట్టుకొని ప్రజలకు సేవ చేస్తా… ఇక ఉండలేనంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భౌతికంగా నిర్మూలిస్తుంటే పార్టీలో ఎందుకుండాలంటూ జీవన్ రెడ్డి నిలదీశారు.