విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఈనెల 28వ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత కంటి చికిత్స శిబిరమును నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు వేణుగోపాలాచార్యులు, కార్యదర్శి రమేష్ బాబు, కోశాధికారి నాగేంద్ర పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి క్యాంపు దాతగా కొత్త శ్రీరాములు వ్యవహరించనున్నారని తెలిపారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ శైలజ, విశిష్ట అతిథిగా మార్కండేయులు- సీనియర్ జర్నలిస్ట్ అనంతపురం వారు రానున్నారని తెలిపారు. సభా నిర్వహణగా లయన్స్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకులు పిట్టా వెంకటస్వామి, ముఖ్య వక్తలుగా పళ్లెం వేణుగోపాల్, మోహన్ దాస్ వ్యవహరిస్తారని తెలిపారు. ఇప్పటికే వేల సంఖ్యలో కంటి ఆపరేషన్ లతో పాటు ఉచితంగా అద్దాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగిందన్నారు. కావున ఈ అవకాశాన్ని గ్రామీణ, పట్టణ ప్రాంత పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.