Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

వైకాపా అభ్యర్థుల విజయానికి కృషి చేయండి

పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు వెంకటలక్ష్మి

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- వైకాపా బలపరిచిన అరకు ఎంపీ అభ్యర్థి గుమ్మ తనుజారాణి, పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు ల విజయానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు ఆ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు మత్స్యరాస వెంకటలక్ష్మి అన్నారు. మండలంలోని అన్నవరం లో పర్యటించిన ఆమె వివిధ పంచాయతీలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సచివాలయ, వాలంటీర్ వ్యవస్థల ద్వారా సంక్షేమ పథకాలను లబ్ధిదారుల చెంతకు చేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రాజకీయ పార్టీలకు అతీతంగా అందజేసిన ఏకైక ప్రభుత్వం వైకాపా అన్నారు. స్వాతంత్రం వచ్చిన 76 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా గడచిన ఐదేళ్లలో ప్రతి ఒక్కరికి పథకాలు అందజేసిన వైకాపా ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తెచ్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పథకాలు కొనసాగాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే క్రమంలో వైకాపా అభ్యర్థుల విజయం విషయంలో పార్టీ శ్రేణులకు ఆమె దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కుడుము సారే వార్డు సభ్యుడు బోండా సింహాచలం అన్నవరం మాజీ వార్డు సభ్యుడు సుండ్రు చిన్నబ్బాయి, అధిక సంఖ్యలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img