విశాలాంధ్ర అనందపురం : రాప్తాడులో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ పై జరిగిన దాడిని ఖండిస్తూ పలు పత్రిక సోదరులు గురువారం తగరపువలస అంబేద్కర్ కూడలి వద్ద ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రం సమర్పించారు అనంతరం శాంతియుత ర్యాలీ నిర్వహించి జర్నలిస్టులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ మరల ఇలాంటివి పునరావృతం కాకుండా చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉండాలి కానీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సంఘటన గురించి అస్సలు కూసే లేదని జర్నలిస్ట్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి ఇలాంటి ద్వంద వైఖరి మానుకోవాలని పత్రిక స్వేచ్ఛను హరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వ నాయకులు వ్యవహరిస్తున్నారని జర్నలిస్టులపై దాడి చేసే వారికి కఠినమైన శిక్షలను అమలు పరచాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో భీమిలి, ఆనందపురం, పద్మనాభం, మధురవాడ, విలేకరులు పాల్గొన్నారు.