విశాలాంధ్ర – ఆనందపురం : ఆనందపురం మండలం కుసులవాడ గ్రామ పంచాయతీకి చెందిన సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ శినగo గురునాధరావు సోమవారం రాత్రి గుండుపోటుతో మృతి చెందారు. ఎంపీటీసీ గురునాధరావు రాజకీయంగా అనేక సేవలు అందించారు.పార్థివ దేహాన్ని భీమిలి శాసనసభ్యులు ముత్తం శెట్టి శ్రీనివాసరావు , కోరాడ రాజబాబు, విజయబాబు, బంక సత్యం, మజ్జి వెంకట్రావు, పాండ్రంకి శ్రీను, తదితర నాయకుల సందర్శించి సంతాపం తెలిపి ఆయన సేవలను కొనియాడి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.