విశాలాంధ్ర -అనంద పురం : ఆనందపురం గ్రామం ఎంపీపీ స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు అంజనీ కుమారి మేడం గారు మరియు జై జవాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆనందపురం గ్రామ సర్పంచ్ శ్రీ చందక లక్ష్మీ గారు ఎంపీటీసీ కొట్టాడ రమాదేవి గారు జై జవాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కుప్ప రాజశేఖర్ కుప్ప రామలక్ష్మి గారు పాల్గొని శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి సర్వేపల్లి రాధాకృష్ణ గారు గొప్పదనం గురించి ఒక ఉపాధ్యాయ వృత్తి నిండి దేశానికి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిగా చేసిన ఘనత సాధించినటువంటి మహనీయుడు స్వతంత్ర సమరయోధుడు ఆయన జన్మదినం రోజున ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం చాలా మంచి విషయమని తెలియజేయడం జరిగింది అదేవిధంగా ప్రధానోపాధ్యాయురాలు అంజనీ కుమార్ మేడం గారు మాట్లాడుతూ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత స్థానంలోకి వస్తే మీరు గురువులకు ఇచ్చినటువంటి గురుదక్షిణమని పిల్లలందరూ కూడా మీరు అనుకున్నటువంటి రకరకాల రంగంలో అభివృద్ధి చెందాలని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆకాంక్షించారు ఒక కార్యక్రమంలో జై జవాన్ ఫౌండేషన్ తరపున స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కె.అంజనీ కుమారి మేడం కె సుబ్బలక్ష్మి మేడం ప్రవీణ్ కుమారి జయలక్ష్మి మేడం గారికి ఫౌండేషన్ తరపున సాలువ షీల్డ్ స్వీటు సన్మానం చేసి మాకు విద్య నేర్పిన గురువులకు ఈ రకంగా సన్మానం చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ యొక్క కార్యక్రమంలో రెడ్డి బాబు గారు వీఆర్వో అప్పలరాజు గారు ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ ముడసల శ్రీను కోశాధికారి కుప్ప రామలక్ష్మి గారు స్కూల్ కమిటీ చైర్మన్ ఎర్నమ్మ గారు సచివాలయం సిబ్బంది సెక్రటరీ దేవీ వసంత గారు రామకృష్ణ సోమేశ్వరరావు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.