ఎయిర్పోర్టు పనులను పరిశీలించిన సిఎస్ జవహర్రెడ్డి
విశాలాంధ్ర.భోగాపురం, (విజయనగరం) : విమానాశ్రయ నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని, రాష్టప్రభుత్వ ఛీప్ సెక్రటరీ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డు విమానాశ్రయ నిర్మాణ పనులను ఆయన సోమవారం పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ఎయిర్పోర్టు టెర్మినల్ భవనం, రన్వే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ భవనాలు, ఇతర నిర్మాణ పనులను ఆయన సందర్శించారు. ఎయిర్పోర్టు ప్లాన్లను పరిశీలించారు. నిర్మాణ పనులకు సంబంధించిన అంశాలను జిఎంఆర్ ప్రతినిధులు వివరించారు. ఇప్పటివరకు జరిగిన పనులపట్ల జవహరరెడ్డి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్, ఆర్డిఓ ఎంవి సూర్యకళ, తాశిల్దార్ శ్యామ్ ప్రసాద్, జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లిమిటెడ్ సిఇఓ మనోమయ్ రాయ్, ప్రాజెక్టు హెడ్ బిహెచ్.ఎ.రామరాజు, ఇతర ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.