చాట్రాయి: పర్వతనేని గంగాధర్ పర్యటన ప్రదర్శనగా మారింది. ఉహించని విధంగా వందలాదిగా తరలివచ్చారు. రెండు గ్రామాల బలహీన వర్గాల ప్రజలు గంగాధర కు బ్రహ్మరథం పట్టారు. టిడిపి నూజివీడు నియోజకవర్గ శాసనసభా స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం కోసం వేగంగా పావులు కదుపుతున్న గంగాదర్ ఆదివారం రాత్రి చాట్రాయి మండలం లో జనార్దనవరం ,ఆరుగొలనుపేట గ్రామలలో పర్యటన చేసి ఆర్థిక సాయం చేయడంకోసం రావడంతో టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున కదలి గంగాదర్ తో పాటు కార్యకర్తలు కూడా బాదితుల ఇళ్ళకు వెళ్ళడంతో పర్యటన ప్రదర్శనగా మారింది.కొన్ని సంవత్సరాలుగా పార్టీ నాయకత్వంలో వుండి పెత్తనం చేసిన వారిని మరిపించే విదంగా ప్రజలలో మమేకం అయిపోతున్నారని అబినందిస్తున్నారు.రెండు గ్రామాలుకూడా బలహీన వర్గాలకు బలమైన గ్రామాలు పెద్ద ఎత్తున గంగాదర్ తో ప్రదర్శన చేయడంతో రాజకీయ కాక పెరిగిందని పలువురు అంటున్నారు.