Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

రాక్షస పాలన విముక్తి కోసం వారాహి యాత్ర…

జుత్తిగ నాగరాజు…

విశాలాంధ్ర -ఉండి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల కు జగనాసుర పాలన నుండి విముక్తి కోసం
నేటి నుండి జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ను ప్రారంభిస్తున్నారని ఈ యాత్రకు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని జనసేన నుండి నియోజకవర్గ ఇన్చార్జి చిత్తుగా జుత్తుగ నాగరాజు పిలుపునిచ్చారు. యాత్రకు ఎటువంటి అడ్డంకులు ఇబ్బందులు తలెత్తకుండా విజయం సాధించాలని నాగరాజు ఆధ్వర్యంలో ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులంతా కలిసి మంగళవారం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉండి గ్రామంలో పలు దేవాలయాలు, కాళ్ళ మండలం కాళ్ళకూరు గ్రామంలో వెంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వారాహి యాత్ర విజయవంతం కావాలని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ జుత్తుగ నాగరాజు , జిల్లా ప్రధాన కార్యదర్శి గవర లక్ష్మి , రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు తోట వాసు మండల అధ్యక్షులు ఎరుబండి రామాంజనేయులు , కోటికలపూడి తాతాజీ , ఉపాధ్యక్షులు గడి రాము , ఓగిరాల రాజేష్ , నాలుగు మండలాల ప్రధాన కార్యదర్శులు, కార్యదర్సులు, గ్రామాద్యక్షులు పార్టీ పెద్దలు జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img