ఏథెన్స్ : గ్రీస్ కమ్యూనిస్టు పార్టీ 47వ వార్షికోత్సవాలు రాజధాని ఏథెన్స్లో అత్యంత ఘనంగా జరిగాయి. మూడురోజులపాటు జరిగిన మహాసభలు శనివారం సాయంత్రం భారీ బహిరంగ సభతో ముగిసాయి. గ్రీకులోని ప్రతి ప్రాంతం నుండి వేలాదిమంది ప్రజలు, కార్మికులు, యువతీ, యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో నెలకొన్న అణచివేత, దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనకు సెంట్రల్ కౌన్సిల్ సెక్రటరీ నికోస్ అబాటిలోస్, కేకేఈ జనరల్ సెక్రటరీ డిమిట్రిస్ కౌట్సుంబాస్ పిలుపునిచ్చారు. పారిస్ కమ్యూన్, రష్యాలో జరిగిన అక్టోబరు సోషలిస్టు విజయాన్ని ఈ సందర్భంగా వక్తలు స్పురణకు తెచ్చారు. కార్మికవర్గానికి కమ్యూనిస్టులు తమ సంఫీుభావాన్ని ప్రకటించారు. సోషలిజం దేశ పురోగతికి మార్గదర్శకంగా అభివర్ణించారు. పెట్టుబడీదారీ విధానాల లాభాపేక్ష దేశ ఆర్థికవ్యవస్థ పనితీరును అడ్డగిస్తుందని పేర్కొన్నారు.